రేపే టెన్త్ రిజల్ట్స్.. ఉదయం 11 గంటలకు రిలీజ్

by Bhoopathi Nagaiah |   (  Updated:2023-05-05 12:28:23  IST  )

రాష్ట్రంలోని పదో తరగతి పరీక్షా ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. ఈనెల 6న పరీక్ష ఫలితాలు విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

రేపే టెన్త్ రిజల్ట్స్.. ఉదయం 11 గంటలకు రిలీజ్
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలోని పదో తరగతి పరీక్షా ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. ఈనెల 6న పరీక్ష ఫలితాలు విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. విజయవాడలో శనివారం ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఉపాధ్యాయ సంఘాల నేతలతో చర్చల సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ ఈ ప్రకటన చేశారు. ఇకపోతే ఏప్రిల్ 3 నుంచి 18వరకు 10వ తరగతి పరీక్షలు జరిగాయి. అయితే అయితే ఈ ప్రచారంపై డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ డి.దేవానందరెడ్డి స్పందించారు. తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రకటనే అధికారికం అని స్పష్టం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇంతలో విద్యాశాఖ మంత్రి రిజల్ట్స్ విడుదలకు ముహూర్తం ఖరారు చేశారు. మే 6న విడుదల చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

Also Read...

బ్రేకింగ్: పదవ తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్.. రేపే రిజల్ట్స్ విడుదల

Next Story